1 July, 2026 | 7:41 PM

Breaking News

కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •  

దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

09-04-2025 01:26 AM

జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు 

సంగారెడ్డి, ఏప్రిల్ 8(విజయక్రాంతి)దివ్వాంగుల కోసం ప్రతినెల మొదటి శనివా రం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. అయితే ఈనెల 5వ తేదీన సెలవు కారణంగా మంగళవారం నాడు దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి, డీఆర్డీవో పాల్గొన్నారు. మొత్తము 23 దరఖాస్తులు రాగా వాటిని త్వరితగతను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు.

సదరం సర్టిఫికెట్, రెన్యూవల్ కోసం సంబంధిత దివ్యాంగులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సదరం క్యాం పులో స్లాట్ బుకింగ్ కోసం మొబైల్ యాప్లో సిటిజన్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పారు. నెలలో రెండుసార్లు సదరం స్లాట్ బుకింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ, డీఆర్డీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ప్రతినెలా మొదటి శనివారం నాడు దివ్యాంగుల ప్రజావాణి నిర్వహించడం జరుగుతుంది.