18-06-2025 05:32:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని ప్రభుత్వం దీప దీప నైవేద్యం కింద ఎంపిక చేసి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతూ బుధవారం పాలకవర్గ సభ్యులు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు(DCC President Srihari Rao)ను కలిసి వినతి పత్రం అందజేసారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంఘం నాయకులు ప్రతినిధులు శ్రీహరి రావుకు సమస్య గురించి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాల్వ డైరెక్టర్ గా శ్రీ వన్నెపన్నే శివకుమార్ ని నియమించినందుకు ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణుల తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇద్దరికీ శాలువా మెమొంటోతో సత్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో నిర్మల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ సుద్దాల సత్యనారాయణ.. వన్నెపని శివకుమార్ కాల్వ నరసింహస్వామి డైరెక్టర్, నాంపల్లి కిరణ్, గణేష్, సాగర్, రామతీర్థం, రామయ్య, జీవన్, వేణు, వల్లంపట్ట సత్యనారాయణ, చిలుముల రవి, వెంకటస్వామి, శ్రీనివాస్, సత్యం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.