23-06-2025 01:44:45 AM
- ట్యాంక్ బండ్ నుంచి శ్రీశైలం వరకు బైక్ ర్యాలీ ప్రారంభం
- మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
ముషీరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): బ్రహ్మంగారి భోధనలను యువత స్ఫూర్తిగా తీసుకొని సన్మార్గంలో పయనించాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ట్యాంక్ బండ్ పై గల శ్రీ పోతులూరి వీరభ్మేంద్ర స్వామి విగ్రహం వద్ద విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి, ఏసీపీ కమ్మరిపల్లి కిరణ్ కుమార్లు హాజరై వీరబ్రహ్మేం ద్ర స్వామి విగ్రహనికి పూల మాలలు వేసి పూజలు చేశారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ వీరబ్మ్రేంద్ర స్వామి భవిష్యత్ ను ముందే అంచనా వేసి రాసిన కాలాజ్ఞనం ఎంతో ప్రసిద్ధి చెందిందని అన్నారు. అనేక సంఘటనలు నిజమైయ్యాయని గుర్తు చేశారు. విశ్వకర్మ సంఘంలో యువత ఐక్యతను చాటెందుకు యువత యాత్రను చేపట్టినట్లు నిర్వాకులు తెలిపారు.
ట్యాంక్ బండ్ నుండి శ్రీశైలం వరకు వివిధ వాహనాలలో ర్యాలీ గా భయలు దేరినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, సంఘం నాయకులు. విశ్వనాధుల పుష్పగిరి, ఖతరోజు కిరాణకుమార్ ట్రాన్సకో (ఏడిఈ) కమ్మరి పల్లి కిరణ్ కుమార్ (ఏసీపీ) మా రోజు సుదర్శనా చారీ. కుందారపు గణేష్ చారి తదితరులు పాల్గొన్నారు.