23-06-2025 01:45:43 AM
చేపల విక్రయాలు..మద్యం సరఫరా
ప్రమాదం అంచున యువత సెల్ఫీలు
పట్టింపు లేనట్టు పోలీసుల తీరు
వనపర్తి, జూన్ 22 (విజయక్రాంతి) : వనపర్తి గద్వాల జిల్లాలకు అనుసంధానంగా ఉన్న జూరాల ప్రాజెక్టు వద్ద జల సవ్వల్ల దృ శ్యాలు వర్ణించలేనివి. ప్రాజెక్టు గేట్లు ఎత్తారు అన్న విషయం తెలిసిందంటే సందర్శనలకు తాకిడి మొదలవుతుంది. ఆదివారం ప్రభుత్వ సెలవుల్లో మరింతగా తాకిడి ఎక్కువ గానే ఉంటుంది. ఒకవైపు కృష్ణమ్మ అందాలతో మరొక వైపు ఘుమ ఘుమలాడే చేపల కూరలు ఇక్కడ ప్రత్యేకం.
జూరాల అందాలను వీక్షించేందుకు వచ్చే సందర్శకుల కోసం మత్స్యకార కుటుంబాలు తాజా చేపలను నచ్చిన రీతిలో వండి ఇస్తుంటారు. ఇష్టమైన చేపలను ఎంచుకొని వంట చేయించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. జూరాల ప్రాజె క్టు ను నమ్ముకుని దాదాపుగా 200 కు పైగా మత్స్యకార కుటుంబాలను ఆధార పడి జీవనం కొనసాగిస్తున్నారు. . ప్రాజెక్టుకు రెం డు వైపులా చిన్న హోటల్లు ప్రాజెక్టు కు కుడి ఎడమవైపున తాజాగా పట్టుకుని వచ్చిన చేపలను అమ్ముతుంటారు.
సందర్శకులు వాటిని కొనుగోలు చేసి హోటల్ వాళ్లకి ఇవ్వడంతో కొద్ది నిమిషాల్లోనే చేపల ఫ్రై, పులు సును వేపుడు రెడీ చేసి ఇస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రాజెక్టులు దొరికే చేపలు వండించుకుని సందర్శకులు తిని ఆనందిస్తుంటారు.
ప్రాజెక్టు వద్ద నీటి వరద ప్రారంభం నుండి వరద తగ్గేవరకు మత్స్యకార కుటుంబాలకు చేతినిండా పని దొరుకు తుంది. ఒకరు చేపలు పట్టడం మరొకరు విక్రయించడం ఇంకొకరు చేపలను కటింగ్ చేసి శుభ్రం చేయడం ఇంకొకరు తెచ్చిన చేపలను సందర్శలకు తగిన రీతిలో వండి పెట్టడంతో వారికి చేతినిండా ఉపాధి దొరుకుతుంది.
వరద పొంగింది.. మద్యం పారింది
జూరాల ప్రాజెక్టు అందరం వీక్షించేందుకు అత్యధికంగా యువత అక్కడకు బైకు లు, కారులు వంటి వాహనాలతో చేరుకుంటారు. అక్కడ ముందుగా చెపలను కొనుగో లు చేసి వండటానికి ఇచ్చిన తర్వాత అక్కడే ఏరులై పారుతున్న మధ్యాని సేవిస్తున్నారు . అంతలా మద్యం ఏరులై పారుతున్న ఎవరు పట్టించుకోక పోవడం కొసమెరుపు.
తనిఖీలు ఎక్కడ?
జూరాల ప్రాజెక్టు సందర్శనలో భాగంగా విపరితంగా మద్యం సేవిస్తున్న యువకులకు అక్కడ చేపల ఫ్రై చేసే నిర్వాహకులు మద్దతు తెలపడం కొస మెరుపుగా మారింది. పేరు కే చెపల ఫ్రై దుకాణాలు కానీ ప్రతి దుకాణంలో చిన్నపాటి వైన్స్ మద్యం సిట్టింగ్ తరహాలో ఉన్న అక్కడ పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న ఆరోపణలు మెండుగా ఉన్నాయి.
ప్రాజెక్టు సందర్శనకు దాదాపుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉంటారు. అధికంగా మ ద్యం సేవించి పలు రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నప్పటికి పోలీసులు తనిఖీలు చేయకపోవడం వెనుక పలు అనుమానాలకు తావు తీస్తుంది.
ప్రమాదం అంచున సెల్ఫీ లు..
జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ అందాలను వీక్షించేందుకు ఇతర ప్రాంతాల నుండి యువకులు, కుటుంబ సభ్యులు అత్యధిక స్థాయిలో వస్తుంటారు. ప్రాజెక్టుల నుండి వరద నీటిని గేట్ల బయటకు తరలిస్తుంటా రు.
ఈ నేపథ్యంలో వరద నీరు బయటకు వస్తున్న దగ్గర ప్రమాదం భరితంగా ఉన్నప్పటికీ అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తో వరద నీరు ప్రవహిస్తున్న ప్రదేశం లో యువకులు, ఆయా కుటుంబ సభ్యులు సెల్ఫీ లు దిగుతున్నారు. ఇలా సెల్ఫీ లు దిగుతూ ప్రాణాలను పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.
జూరాల స్పెషల్ తాజా చేపల వేపుడు పులుసు
జూరాల ప్రాజెక్టుల గల చేపలను వినియోగదారుల కండ్ల ముందే బ్రతికున్న చేపలను పట్టడం వంటివి వాటితోపాటు దానిని చకచకా కడిగి నిమిషాల్లోనే చేపల పులుసు వేపుడు వంటివి చేయడం జూరాల మత్స్యకారుల ప్రత్యేకత. జూరాల అందాలను వీక్షించడానికి వచ్చిన సమయంలో ఆకలి ఎలా తీరుతుందని ఆందోళన పడాల్సిన అవసరం లేదని కండ్ల ముందే తమకు నచ్చిన రీతిలో వంటలు చేయించి సందర్శకులకు ఇవ్వడం ఇక్కడి స్పెషల్.