27-06-2025 01:19:46 AM
* ఆర్టీఏ కార్యాలయాల్లో కొందరు లంచాలకు మరిగారు. ఏజెంట్ల ద్వారా అందినకాడికి సొమ్ము దోచుకుంటున్నారు. చేయితడపనిదే ఆర్సీ బుక్స్, లైసెన్స్లు జారీ చేయడం లేదు. ఆర్టీఏ అధికారులు, సిబ్బంది అవినీతి, ఏజెంట్ల ఆగడాలపై ఫిర్యాదులు అందుకున్న అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 18 చోట్ల ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లాకేంద్రంతోపాటు హైదరాబాద్లోని ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో సుమారు 20 మంది ఏజెంట్లు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వారి నుంచి ఏసీబీ సిబ్బంది కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకున్నారనే అనుమానంతో పలువురు సిబ్బందిని విచారించారు. ఏసీబీ దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న మరికొందరు ఏజెంట్లు కార్యాలయాల నుంచి బయటకు పరారయ్యారు.
ఏసీబీ సిబ్బంది సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద పలువురు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.92 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలపై ఇద్దరు ఆర్టీఏ సిబ్బందిని విచారించారు. ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయాల్లో దాడులు నిర్వహించి, సుమారు 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.
ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో 10 మంది ఏజెంట్ల నుంచి రూ.3,450 నగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారించారు.
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఆర్టీఏ సిబ్బందిపై అందుతున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని గురువా రం ఏసీబీ రాష్ట్రవ్యాప్తంగా 18 చోట్ల ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీలు శ్రీధర్, ఆనంద్కుమార్ నేతృత్వంలో ఏసీబీ అధికారు లు ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో ఉప్పల్ కార్యాలయం లో ఉన్న 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.
వారు ఏయే అధికారులు, సిబ్బందితో పైరవీ చేస్తున్నారనే అంశంపై విచారణ చేపట్టారు. ఏజెంట్ల నుంచి రూ.3,450 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్సీ బుక్స్, డ్రైవింగ్ లైసెన్సు కోసం వీరు కార్యాలయంలో పైరవీ చేస్తున్నట్లు గుర్తించారు. దాడులు జరుగుతు న్నాయని సమాచారం అందుకున్న కొందరు ఏజెంట్లు అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు వెల్లడించారు.
ఏజెంట్ల ద్వారా కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని తమకు సమాచారం అందిందని, తమకు ఫిర్యాదులు అందడంతోనే దాడులు చేశామని డీఎస్పీలు తెలిపారు. అలాగే తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలోనూ దాడు లు నిర్వహించామని, కార్యాలయాల గేట్లు మూసిమరీ సోదా చేశామని తెలిపారు.
10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. ఏజెంట్లు, ఆర్టీ సిబ్బంది అవినీతిని సుమోటోగా స్వీకరించి దాడులు నిర్వహించామని స్పష్టం చేశారు. మరోవైపు ఏసీబీ దాడుల కారణంగా డ్రైవిం గ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వాహనదారులు కార్యాలయాల ఎదుట కొన్ని గంటలుగా వేచి చూశారు.
పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయంలో...
పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సోదాలు చేశా రు. పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఏసీబీ సోదాలు జరుగు తున్నాయని కొందరు ఏజెంట్లు అక్కడి నుం చి పరారైయినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లా మద్నూర్ శివా సలాబత్పూర్ ఆర్టీవో చెక్పోస్ట్లో తెల్లవారజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చెక్పోస్ట్ వద్ద కొందరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి, పోయే లారీలను అడ్డుకుని డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. పలువురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.92 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రాజశేఖర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..
చెక్పోస్టు వద్ద నగదు వసూళ్లు, అవినీతి జరగుతున్నదని తమకు ఫిర్యాదులు అందాయని, దీంతో తాము దాడులు నిర్వహించామని స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే ఇద్దరు రవాణాశాఖ అధికారులను విచారించామని తెలిపారు. గతంలోనూ ఈ చెక్పోస్టు వద్ద దాడులు జరిగాయని, అప్పుడు కూడా ఏసీబీ పలువురిని అదుపులోకి తీసుకున్నదని గుర్తుచేశారు. మరోవైపు ఏసీబీ దాడులపై జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డిని వివరణ కోరగా.. సలా బత్పూర్ చెక్పోస్టు వద్ద దాడులు వాస్తవమేనని తెలిపారు.