కాగజ్నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు
02-06-2026 06:02 PM
జైనూర్,(విజయక్రాంతి): కాగజ్నగర్లో జరిగిన ప్రభుత్వ సభలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ప్రోటోకాల్ కల్పించలేదని, మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్ రాజకీయ సభగా మార్చి, ప్రజలు ఎన్నుకున్న ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేను వేదికపై అవమానించారని వారు విమర్శించారు. నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించే అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, హామీలపై ప్రశ్నలు వస్తాయనే భయంతోనే ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆదివాసీ ఎమ్మెల్యేను అవమానించడం అంటే ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనని వారు వ్యాఖ్యానించారు.






