15 June, 2026 | 7:29 PM

Breaking News

ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •  

విద్యార్థులను పరామర్శించిన బీఆర్ఎస్ ఇంచార్జ్

01-11-2025 04:59 PM

గద్వాల: గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ ప్రభుత్వ బాలురు హాస్టల్‌లో కలుషిత ఆహారం తీసుకొని విద్యార్థులు అస్వస్థతకు గురై  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాస్ హన్మంత్ నాయుడు శనివారం విద్యార్థులను పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకొని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ పై పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు.