18-10-2025 12:19:26 PM
మండలంలో బీఆర్ఎస్ నేతల ర్యాలీ
హన్వాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచాల్సిందేనని మండలంలో బిఆర్ఎస్ నేతలు(BRS leaders) ప్రధాన రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ వస్తుందని, 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పుకుంటూ కాలయాపన చేసి తీరా ఇప్పుడు హోటల్ వద్దంటున్నాయి అనే రీతిలో చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు.
రిజర్వేషన్ అని చెప్పినప్పుడు కోర్టులు వద్దంటాయా?అవునంటాయా? అని వారికి తెలియదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కనీసం ఆ మాత్రం అంచనాలు లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ జీవోలు ఎలా జారీ చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లును పొందుపరిచి రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు లక్ష్మయ్య, కృష్ణయ్య గౌడ్, వెంకట్, నాగయ్య, జిల్లెల తేజవర్ధన్, తదితరులు ఉన్నారు.