27-05-2025 11:01:27 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బోడా బాలు నాయక్(BRS General Secretary Boda Balu Naik) కి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు వద్ద హైవే రోడ్డుపై మంగళవారం ఉదయం 4 గంటలకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.