16-06-2025 11:18:24 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి(MLA Padi Kaushik Reddy) తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. సుబేదారీ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు కొట్టివేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టులో(Telangana High Court) పిటిషన్ దాఖలు చేశారు. గ్రానైట్ వ్యాపారి మనోజ్ ను బెదిరించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కమలాపురం మండలం వంగపల్లిలో మనోజ్ క్వారీ నిర్వహిస్తున్నాడు. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై సుబేదారీ పీఎస్(Subedari Police Station) లో కేసు నమోదు అయింది. రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బెదిరించారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.