16-06-2025 01:23:47 PM
హైదరాబాద్: హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ(Greater Hyderabad Municipal Corporation) ప్రధాన కార్యాలయం దగ్గర సోమవారం ఉద్రిక్తత నెలకొంది. నగర సమస్యలపై అధికారులను నిలదీసేందుకు బీజేపీ కార్పొరేటర్లు(BJP Corporators), కార్యకర్తలను భారీగా జీహెచ్ఎంసీ ఆఫీస్కు చేరుకున్నారు. జీహెచ్ఎంసీ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు బీజేపీ నేతలు(BJP leaders) ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో జీహెచ్ఎంసీ ప్రధాన గేటు ముందు బీజేపీ నేతలు బైఠాయించారు. నగరంలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ(Street Lights Maintenance), మాన్సూన్ కు మందస్తు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.