బొగ్గు గనుల మీద బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రచారం

23-04-2024 02:11:26 AM

మంచిర్యాల, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): శ్రీరాంపూర్ డివిజన్‌లోని పలు బొగ్గు గను ల్లో సోమవారం బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. బొగ్గు గని కార్మికుడిగా పని చేసిన తనకు కార్మికుల కష్టాలు తెలుసునని, కార్మికుల కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. కారుణ్య నియామకాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని, 20 వేల మంది ఉద్యోగాలు కల్పించామని స్పష్టంచేశారు. తనను గెలిపిస్తే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని, కార్మికుల గొంతుక అవుతానని చెప్పారు. వీరివెంట టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డిస ఉన్నారు.