మోసపూరిత బీజేపీ, బీఆర్‌ఎస్‌ను నమ్మొద్దు

23-04-2024 02:13:02 AM

l కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలి 

l వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

వనపర్తి , ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మోసపూరిత బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మాటలు నమ్మవద్దని.. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని అఖండ మెజారిటితో గెలిపించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం వనపర్తి పట్టణంలో ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు కష్టపడి 25 రోజులు పని చేయాలని కోరారు. గత పాలకులు ప్రజల సొమ్ము దోపిడీ చేసి రూ.27 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి వెళ్లిపోయారని, మెడికల్ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల పనులు మొత్తం అప్పులతో చేపట్టారని అన్నారు. అన్ని ఆధారాలతో జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాకు వస్తామని సవాల్ విసిరారు. కొడంగల్ తరువాత వనపర్తికి పెద్ద ఎత్తున నిధులను తీసుకొస్తానని హామీ ఇచ్చారు.