23-06-2025 02:11:43 PM
గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాసరావు కి వినతిపత్రం
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్యం పనులు వెంటనే చేపట్టాలని, వీధిలైట్లు ప్రతి కాలనీలో వేయాలి, డ్రైనేజీ పూడిక లు తీయాలి, అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ మానే రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. భద్రాచలం గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాసరావు కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బిఆర్ఎస్ నేతలు భద్రాచలంలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ డివిజన్ నాయకులు మానే రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినప్పటికీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఈరోజు వరకు కూడా అమలు కాలేదని, ఆ హామీలు గ్యారంటీలు నెరవేరే దాకా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వం పై ఆందోళన చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అని అన్నారు. భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హామీలన్నీ అమలు చేసేంతవరకు కూడా దశల వారి ఆందోళన కార్యక్రమం చేపడతామని మానే రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెల్ నాయకులు, బీఆర్టీయు నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అందరూ పెద్ద ఎత్తున వచ్చి గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన చేశారు.