23-06-2025 02:04:20 PM
హైదరాబాద్: తెలంగాణ సమాజం(Telangana society) ఏనాడు కల్వకుంట్ల కుటుంబాన్ని క్షమించదని, కాళేశ్వరం, లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ కేసులలో సరైన విచారణ జరిపి కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) నిజామాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ నెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు(National Turmeric Board) ప్రారంభం కానుందని చెప్పారు.
రాబోయే రోజుల్లో శాశ్వత భవనానికి సన్నాహాలు చేస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం, లిక్కర్ స్కామ్, ట్యాపింగ్ కేసులలో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao), కేటీఆర్, కవితలను రప్పా.. రప్పా.. జైలులో పెట్టాలంటూ పుష్ప-2 డైలాగ్ కొట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి తన్నీరు హరీష్ రావు(Thanneeru Harish Rao) తప్ప ఎవరూ గెలవరని జోస్యం చెప్పారు. అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ నేతలను జైలులో పెట్టకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు.