8 March, 2026 | 3:38 PM

Breaking News

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు   •   ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •  

పార్టీలు మారకుంటే బిఆర్ఎస్ సమావేశానికి హాజరుకండి

19-12-2025 06:21 PM

ఎమ్మెల్యేలకు సవాల్ విసిరిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్

హుజురాబాద్,(విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో చేరలేదని ప్రగల్బాలు పలుకుతున్నారని, నిజంగా ఎమ్మెల్యేలు పార్టీ మారకుంటే ఈనెల 21న జరిగే బిఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ సవాల్ విసిరారు. బిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీకి పోయిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

గెలిపించిన ప్రజలను మోసం చేస్తూ పార్టీ మారి ఇప్పుడు చర్యలు తీసుకునే సమయానికి తగు పార్టీలు మారలేదంటూ దొంగ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. నిజంగా పార్టీ మారితే దమ్ముంటే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల పదవులు పొంది కష్టకాలంలో పార్టీని వదిలి పోవడం సిగ్గుచేటు అన్నారు.

ఇప్పటికైనా పార్టీ నుంచి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పడంలో నిజాయితీ ఉంటే తప్పక టిఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని అన్నారు. ఒకవేళ హాజరు కాకపోతే వారు పార్టీ మారిన ప్రజా ప్రతినిధులుగా మిగిలిపోతారని అన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు ప్రజల ముందు దోషులుగా నిలబడతారని, భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం కూడా ప్రజలు చెబుతారని అన్నారు.