15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పార్టీలు మారకుంటే బిఆర్ఎస్ సమావేశానికి హాజరుకండి

19-12-2025 06:21 PM

ఎమ్మెల్యేలకు సవాల్ విసిరిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్

హుజురాబాద్,(విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో చేరలేదని ప్రగల్బాలు పలుకుతున్నారని, నిజంగా ఎమ్మెల్యేలు పార్టీ మారకుంటే ఈనెల 21న జరిగే బిఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ సవాల్ విసిరారు. బిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీకి పోయిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

గెలిపించిన ప్రజలను మోసం చేస్తూ పార్టీ మారి ఇప్పుడు చర్యలు తీసుకునే సమయానికి తగు పార్టీలు మారలేదంటూ దొంగ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. నిజంగా పార్టీ మారితే దమ్ముంటే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల పదవులు పొంది కష్టకాలంలో పార్టీని వదిలి పోవడం సిగ్గుచేటు అన్నారు.

ఇప్పటికైనా పార్టీ నుంచి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పడంలో నిజాయితీ ఉంటే తప్పక టిఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని అన్నారు. ఒకవేళ హాజరు కాకపోతే వారు పార్టీ మారిన ప్రజా ప్రతినిధులుగా మిగిలిపోతారని అన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు ప్రజల ముందు దోషులుగా నిలబడతారని, భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం కూడా ప్రజలు చెబుతారని అన్నారు.