27 July, 2026 | 6:19 PM

Breaking News

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •   హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: టీయూసీఐ   •   ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •  

లిక్కర్ కేసుతో బీఆర్‌ఎస్‌కు తీవ్ర నష్టం

28-02-2026 12:45 AM
  1. మద్యం కుంభకోణం సాకుతో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారు

కవితకు కోర్టులో న్యాయం జరిగింది

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : మద్యం కుంభకోణం కేసు వల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా నష్టపో యిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం అనే సాకుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో కోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.

కవితకు కోర్టులో న్యాయం జరిగిందని, ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని, కల్పితమని త్వరలోనే తేలిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. సత్యం గెలిచే వరకు, కాంగ్రెస్, బీజేపీలు చేసే బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను మనం చూశామని, అసత్య పూరిత కుట్రపూరిత కేసులను ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి,

మా ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తూ, సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యతనిస్తూ, న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ ‘నవ భారతం’లో అలవాటుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ చివరికి, న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు.