యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : బీబీనగర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీటీసీ తోర్పునూరి స్వప్నారాజశేఖర్గౌడ్ బీఆర్ఎస్ని వీడి భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. గూడూరు నుంచి మొత్తం 150మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.