26 April, 2026 | 6:09 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఆక్రమిత స్థలాన్ని స్వాధీన చేసుకోవాలి

08-01-2026 06:56 PM

మున్సిపల్ కమిషనర్ రమేష్ కు బీఆర్ఎస్వీ నేత శ్రావణ్ వినతి

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లిలో కాంగ్రెస్ నాయకుడు కంకటి శ్రీనివాస్ ఆక్రమించిన ఎస్సీ కార్పొరేషన్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, ఆ స్థలానికి ఇచ్చిన నెంబర్ ను రద్దు చేసి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ విజ్ఞప్తి చేశారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బడికల శ్రవణ్ మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణం చౌడేశ్వరి ప్రాంతంలోఎస్సీ  కార్పొరేషన్ దుకాణ సముదాయానికి చెందిన ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నంబర్ పొందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే ఆ ఇంటి నంబర్ రద్దు చేయాలని కోరారు. గత 30 సంవత్సరాల క్రితం బెల్లంపల్లి పట్టణంలో SC కార్పొరేషన్ వారు 6 రూముల దుకాణ సముదాయాన్ని నిర్మించారని తెలిపారు. ఆ రూముల వెనక ఉన్న ఖాళీ స్థలాన్ని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కాంగ్రెస్ అద్యక్షుడు కంకటి శ్రీనివాస్ కబ్జా చేసి ఇంటి నంబర్ (20345) కూడా పొందాడన్నారు. తక్షణమే స్పందించి కమర్షియల్ స్థలాన్ని నివాస యోగ్య  స్థలంగా తప్పుడు పత్రాలు సృష్టించి  అధికారులను తప్పుదోవ పట్టించార నీ తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించి ఇంటి నంబర్ (20345) పొందిన తీరు పై వెంటనే విచారణ జరిపి అధికారులను తప్పుడోవపట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి బడికల శ్రావణ్ విజ్ఞప్తి చేశారు.