08-01-2026 06:53:14 PM
చండూరు,(విజయ క్రాంతి): చండూరు మున్సిపాలిటీలో గురువారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. స్థానిక యూనియన్ బ్యాంక్, కస్తాల రోడ్డు సమీపంలో 12 మందిపై దాడి చేసి గాయపరిచింది. గమనించిన స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం చండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండడంతో కుక్క కాటుకు గురైన వారందరికీ వైద్య సిబ్బంది చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వైద్య అధికారి మాసరాజు తెలిపారు. కొందరుస్థానికులు పిచ్చికుక్కను పట్టుకొని చంపినట్లు తెలిపారు.