12 March, 2026 | 12:06 PM

నాలుగు రోజులపాటు మిషన్ భగీరథ తాగునీరు బంద్

12-03-2026 10:59 AM

తాండూరు, (విజయక్రాంతి): గురువారం ఉదయం నుండి ఆదివారం సాయంత్రం వరకు మిషన్ భగీరథ(Mission Bhagiratha) త్రాగునీటి సరఫరా నిలిపి వేయనున్నట్టు డీఈ విజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.  తాండూర్, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల,ధరూర్ మండలాల పరిధిలో  అన్ని గ్రామలు ,తాండూరు మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరాలో  నాలుగు రోజుల పాటు నిలిపి వేస్తున్నామని పేర్కొన్నారు. పైప్ లైన్  లీకేజ్ కారణంగా మరమ్మతులు జరుగుతాయని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రత్యామ్నాయంగా ఉన్న వాటిచేత నీటి సరఫరా చేసుకోవాలని ఆయన కోరారు.