07-07-2025 11:29:54 PM
క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానంతో..
బీహార్లోని పూర్ణియా జిల్లాలో ఘటన..
పట్నా: బీహార్లో దారుణం చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చంపిన ఘటన పూర్ణియా జిల్లా(Purnia District)లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పూర్ణియా జిల్లా టెట్గామా గ్రామంలో ఇటీవల కొందరు వ్యక్తులు వరుసగా మరణించగా.. చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. గ్రామానికి చెందిన సీతా దేవి(48) క్షుద్ర పూజలు చేయడం వల్లే ఇదంతా జరుగుతుందని గ్రామస్థులు భావించారు.
దీంతో ఆదివారం రాత్రి ఒక చోట చేరిన ఉరి వాళ్లందరూ సీతా దేవి కుటుంబాన్ని చంపాలని నిర్ణయించారు. సోమవారం పంచాయితీకి పిలిపించి సీతాదేవి, భర్త బాబులాల్ ఒరాన్(50), అత్త కాటో దేవి (65), కుమారుడు మంజిత్ ఒరాన్(25), కోడలు రాని దేవి(23) దారుణంగా కొట్టి చంపారు. ఆ తర్వాత నిప్పు పెట్టి దహనం చేశారు. అయితే ఆ కుటుంబం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక పిల్లవాడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు డాగ్ స్కాడ్తో గ్రామానికి వెళ్లగా విషయం బయటపడింది. సమీపంలోని చెరువు నుంచి కాలిన మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.