03-12-2025 12:00:00 AM
పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు
మాగనూరు, డిసెంబర్ 2 : మాగ నూర్ మండలంలో వివిధ గ్రామాలకు వెళ్లి బీటీ రోడ్డు రహదారులు పూర్తిగా అద్వాన స్థితి గా మారాయని ఎప్పుడు ఏ ప్రమాదము జరుగుతుందోనని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మారిన గ్రామాల రహదారులు మారడం లేదని ఆయా గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా రహదారులు పూర్తిగా గుంతలు గుంతలుగా ఏర్పడి వాహనదారులు వాహనాలు వేసుకొని ఈ రహదారుల వెంబడి వెళ్లాలంటే జంకుతున్నామని తెలిపారు.
రాత్రి వేళల్లో రోడ్లపై వేరుపడిన గుంతలలో ప్రయాణించి క్రిందపడి గాయాలైన సంఘటనలు చాలా ఉన్నా యన్నారు. రహదారులు అధ్వానంగా ఉండడంవల్ల గ్రామాల్లో గర్భిణీ స్త్రీలను, మరియు ఇతర ఏదేని సీరియస్ కేసులు ఉంటే ఈ యొక్క రహదారిపై తీసుకు వెళ్లే లోపు మరణించే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాలకు వెళ్లే రహదారులను మరమ్మతులు చేసి మట్టి రహదారులకు బీటీ రోడ్లుగా మార్చి ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.