సాగర్లో బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు
హాజరైన మంత్రి జూపల్లి
నల్లగొండ, మే 1 (విజయక్రాంతి): నాగార్జునసాగర్ బుద్ధవనంలో 2570 బుద్ధ పూర్ణి మ ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై, జాతకవనంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్ను స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, పర్యాటకశాఖ అభివృ ద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డితో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ బౌద్ధ బోధనలకు కేంద్రంగా నాగార్జునసాగర్ అభివృద్ధి కానుందని చె ప్పారు.
ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక వాదాన్ని ప్రబోధించిన నాగార్జునసాగర్ లో బుద్ధవనం అంతర్జాతీయ పర్యాటక కేం ద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేయూతనివ్వనుం దన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప ర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, తెలంగాణ టూరిజం ఎండి గౌతమి, ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, పర్యాటక శాఖ డైరెక్టర్ రంజిత్ నాయక్, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జునరావు పాల్గొన్నారు.






