16-06-2025 03:18:11 PM
హైదరాబాద్: ఇంటి నిర్మాణం అనుమతి కోసం లంచం తీసుకుంటూ మహిళా గ్రామపంచాయతీ కార్యదర్శి అవినీతి నిరోధక బ్యూరో అధికారులకు పట్టుబడ్డింది. వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని నిర్మాణం అనుమతి కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మిని కలిశాడు. అందుకు కార్యదర్శి రూ.8 వేలు లంచం డిమాండ్ చేసింది. చేసేదేమిలేక సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి ముందస్తూ ప్రణాళిక ప్రకారం కార్యదర్శి నాగలక్ష్మి బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.