7 May, 2026 | 2:07 PM

Breaking News

కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •   కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •  

మంటల్లో చిక్కుకున్న బస్సు.. ప్రయాణికులంతా సేఫ్

23-01-2025 04:36 PM

బిలాస్‌పూర్‌: హిమాచల్‌లోని సిమ్లా నుంచి కాంగ్రాకు వెళ్తున్న హెచ్‌ఆర్‌టీసీ(HRTC Bus) బస్సులో ప్రయాణికులు, డ్రైవర్‌, కండక్టర్‌లు తృటిలో తప్పించుకున్నారు. గురువారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం(Chhattisgarh State)  బిలాస్‌పూర్‌లోని కండ్రౌర్‌ సమీపంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌ నుంచి పొగలు రావడంతో డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపేశాడు. ప్రయాణీకులందరినీ బయటకు వెళ్లమని అప్రమత్తం చేశాడు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పిందని అధికారిక ప్రతినిధి తెలిపారు. బస్సు సిమ్లా నుండి కంగ్రాలోని నగ్రోటా బగ్వాన్‌కు వెళ్తుండగా, అందులో డ్రైవర్, కండక్టర్‌తో సహా ఎనిమిది మంది ఉన్నారు.

ప్రయాణికులందరినీ సకాలంలో సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని బస్సు కండక్టర్ సందీప్ సింగ్ తెలిపారు. డ్రైవర్‌, స్థానికులు అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. బస్సులో నుంచి మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు సమీపంలోని చేతి పంపు నుంచి నీటిని తీసుకొచ్చి మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారని తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి(Firefighters) సమాచారం అందించిన వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారని అధికార ప్రతినిధి తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని, అయితే ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు  తెలిపారు.