17 August, 2026 | 3:20 PM

30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

17-08-2026 02:12 PM

పెంచికల్పేట్ (విజయక్రాంతి): దహేగాం మండలంలోని చిన్నరాసపల్లి పరిసర గ్రామాల కార్డుదారుల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన 30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పెంచికల్పేట్ వద్ద అధికారులు పట్టుకున్నారు. సోమవారం విశ్వసనీయ సమాచారం మేరకు డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ రాజ్‌కుమార్, పెంచికల్పేట్ ఎస్సై అనిల్‌కుమార్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. టాటా పికప్ వాహనం (AP 01 Y 4233)లో 60 బస్తాల్లో తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కాగజ్‌నగర్‌కు చెందిన ఖాజా, అస్లాం హుస్సేన్‌లను నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అనిల్‌కుమార్ హెచ్చరించారు. తనిఖీల్లో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.