09-06-2025 04:45:54 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ డిపో ద్వారా ప్రయాణికుల కోసం నిర్మల్ నుండి రామేశ్వరానికి సూపర్ లగ్జరి బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కే పండరి(Depot Manager K Pandari) తెలిపారు. నిర్మల్ నుండి అరుణాచలం, పలని, మధురై, పాతల శెంబు, రామేశ్వరం ధనుష్కోడి యాత్రలకు బస్సు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. రామేశ్వరం వరకు బస్సు వెళ్లి తిరిగి అరుణాచలం గిరి ప్రదక్షిణ దర్శనం చేయించుకుని నిర్మల్ చేరుకుంటుందని ఆయన తెలిపారు.
ప్రయాణపు తేదీ ఛార్జి వివరాలకు 9959226003, 8328021517, 7382842582 సంప్రదించాలని తెలిపారు. అలాగే 36 మంది ప్రయాణికులు ఉంటే ఎక్కడికైనా బస్సు సౌకర్యం కలిపిస్తామని డిపో మేనేజర్ తెలిపారు. భోజన వసతి కల్పించడం జరుగుతుందని ఆసక్తి గల ప్రయాణికులు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.