09-06-2025 04:55:57 PM
ఎంపీడీవో రాజేశ్వర్..
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్(Mandal Parishad Development Officer Rajeshwar) స్పష్టం చేశారు. మండలంలోని అందుగులపేట గ్రామంలో సోమవారం లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ కడారి జీవన్ కుమార్, హౌసింగ్ ఏఈ జోష్నా, కార్య దర్శి వీరేందర్, కాంగ్రెస్ నాయకులు రేగుంట రాజయ్య, వేముల భాస్కర్, చాంద్ పాషా, లింగాల మల్లయ్యలు పాల్గొన్నారు.