09-06-2025 04:41:46 PM
పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా(Suryapet District) కేంద్రంలో సోమవారం సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన రాస్తారోకో కార్యక్రమానికి వెళ్లకుండా మండలంలోని సీపీఎం, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులను పెన్ పహాడ్ పోలీసులు(Penpahad Police) తెల్లవారుజామునే గృహ నిర్భంధం చేశారు. అందులో భాగంగానే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధన్యాకుల శ్రీకాంత్ వర్మను సీపీఎం మండలాధ్యక్షులు గుంజా వెంకటేశ్వర్లుతో పాటు మండలంలోని ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్బంగా శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ... ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని.. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని.. ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని పలు డిమాండ్లను కోరుతూ నేడు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన రాస్తారోకోను పోలీసులతో అడ్డుకోవడం ప్రభుత్వానిది హేయమైన చర్య అన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆగవు అన్నారు.