29-06-2025 11:02:14 AM
హైదరాబాద్: అదుపు తప్పి బస్సు బోల్తాపడిన ఘటన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నుంచి మహారాష్ట్రంలోని అమరావతికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు గుడిహత్నూర్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయాపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్సుల్లో స్థానికంగా ఉన్న ఆదిలాబాద్ రిమ్స్ కు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.