calender_icon.png 29 June, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలతో కలిసి కోర్టు భవనంపై నుంచి దూకిన దంపతులు

29-06-2025 02:26:51 PM

హైదరాబాద్: మెదక్ కోర్టు భవనంపై నుంచి దూకి దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె భర్త, ఇద్దరు చిన్న కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో వారి పిల్లలను కింద పడేసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై ఆదివారం కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... మెదక్ జిల్లా రామాయంపేట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రమ్య(24) 2019లో నవీన్‌(30)ను వివాహం చేసుకుంది. వారికి రుత్విక (5), సస్విక (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే, వారి రెండవ కుమార్తె పుట్టిన తర్వాత భార్యభర్తల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తడంతో రమ్య సంవత్సరం క్రితం రుక్మాపూర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. తన భార్యను తిరిగి పంపమని అత్తమామలను ఒప్పించడానికి నవీన్ రుక్మాపూర్ వెళ్ళినప్పుడు, ఈ నేపథ్యంలో వారి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. ఆ రాత్రి అతను పటాకులు పేల్చి వారి ఇంటిపై దాడి చేశాడని ఆరోపిస్తూ.. రమ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నవీన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.  

ఇదే కేసుపై శనివారం విచారణకు హాజరు కావడానికి దంపతులు ఇద్దరు పిల్లలతోపాటు మెదక్ కోర్టుకు వచ్చారు. అక్కడ మరో వాదన చెలరేగి, కోర్టు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో భర్య మృతి చెందగా, నవీన్, ఇద్దరు పిల్లల యశ్విక, రిత్వికకు గాయాలయ్యాయి.  పరిస్థితి విషమంగా ఉండటంతో తండ్రిని గాంధీ ఆసుపత్రికి, ఇద్దరు చిన్నారులను నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రమ్య కుటుంబికులు ఆరోపణలు.. 

నిన్న కోర్టులో విచారణ లేకున్నా భార్య పిల్లిలను నవీన్ తీసుకువచ్చాడన్నారు. నిన్న సాయంత్రం 6 తర్వాత కోర్టు ప్రాంగణానికి వచ్చిన నవీన్ కుటుంబసభ్యులు రాత్రి 8 గంటల తర్వాత కోర్టు భవనం పైనుంచి కిందకు దూకారు. ఈ ఘటనాలో భార్య రమ్య మృతి చెందింది. భార్య, పిల్లలను భవనం పైనుంచి నవీన్ నెట్టాడని రమ్య కుటుంబీకులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.