రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
05-07-2024 05:35 PM
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయింది. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.






