23-06-2025 12:21:21 AM
గద్వాల టౌన్ జూన్ 22భారత కమ్యునిస్టు పార్టీ(సిపిఐ) ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు ఏం బాల్ నరసింహ పిలుపు ఇచ్చారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం బి.ఆశన్న అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ బీజేపీ మోడీ పాలనలో ఇండియా ధనవంతుల చేతులోకి వెళ్లి పేద ప్రజలు మరింత పేద ప్రజలుగా మారుతున్నారని ప్రజల అవసరాలను జీవితాలను గాలికొదిలేసి కేవలం హిందూ మతం అంటూ కాలం గడుపుతున్నారన్నారు.ప్రజలు సామాన్యుల కోసం నిరంతరం త్యాగాలు పోరాటాలు చేసే కమ్యునిస్టు పార్టీని బలపరచినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో పార్టీ నిర్మా ణం పెంచాలని అందుకోసం నాయకత్వం కృషి చేయాలని జిల్లా సమితి సభ్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సూచించారు. అంతకు ముందు సిపిఐ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు సమావేశ ఎజెండాను పార్టీ ప్రజాసంఘాల కార్యాచరణను వివరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పెద్దబాబు, ఉప్పేరు కృష్ణ, సిద్ధప్ప, రంగన్న, కాసిం, వెంకటేష్, రామాంజనేయులు, శివ ఏఐఎస్ఎఫ్ ప్రవీణ్, వెంకటేష్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.