calender_icon.png 23 June, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్వేయం: కొలన్ శ్రీనివాస్ రెడ్డి

23-06-2025 12:21:17 AM

కుత్బుల్లాపూర్, జూన్ 22(విజయ క్రాంతి):ప్రజా సమస్యల పరిష్కారమే ధ్వేయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల న్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నిజాంపేట్ ము న్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ 2వ డివిజన్ చందు లేఔట్, ఎన్‌ఆర్‌ఐ కాలనీ వాసులు అల్లా డి మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి ని తన కార్యాలయం లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం కాలనీలో పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో నెలకొని ఉన్నటువంటి సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో రాజు, వేముల శ్రీనివాస్, శరత్ రెడ్డి, సందీప్ గౌడ్, జానకిరామ్, శివ, రమేష్, శ్రీనివాస్ దార్కోల్, విజయ్ రెడ్డి, త్రిమూర్తులు, శ్రీకాంత్ తోట తదితరులు పాల్గొన్నారు.