12 July, 2026 | 2:37 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు

30-03-2026 11:09 AM

హైదరాబాద్: సంగారెడ్డి ఐడీఏ బొల్లారంలోని వెంకటరెడ్డి నగర్‌లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. భవనం గ్రౌండ్ ఫ్లోర్ ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి తృటిలో 16 కుటుంబాలు తప్పించుకున్నాయి.  తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో దాదాపు 60 మంది నివాసితులు నిద్రపోతున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.

నివాసితులలో ఒకరు పొగను గమనించి మేల్కొని, భవనంలోని ఇతరులను అప్రమత్తం చేశారు. అగ్నిప్రమాదంలో ఐదు బైకులు, నాలుగు సైకిళ్లు, ప్యానల్ బోర్డు దగ్ధం అయ్యాయి. ఇతర విలువైన వస్తువులు కాలిపోయినప్పటికీ, నివాసితులందరూ సురక్షితంగా తప్పించుకోగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.