ఎల్బీనగర్, ఏప్రిల్ 23 : లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మాల్కాజిగిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పిలుపునిచ్చారు. మార్నింగ్ వాక్లో భాగంగా ఆటోనగర్లోని వనస్థలిపార్క్లో మార్నింగ్ వాకర్స్తో ఎంపీ అభ్యర్థితో కలిసి ఎమ్మెల్యే సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనస్థలి హరిణి పార్క్లో వాకర్స్కు మౌలిక, కనీస సదుపాయాలు, వసతులు కల్పిస్తానన్నారు. నాగోల్ డివిజన్లోని శివపురి కాలనీలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
జయచంద్రారెడ్డి ట్రస్టు చైర్ పర్సన్ కమలాసుధీర్రెడ్డి కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్కే ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మన్సూ రాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, లక్ష్మారెడ్డి, వాకర్స్ పాల్గొన్నారు.