29-05-2025 12:34:24 AM
భద్రాద్రి కొత్తగూడెం, మే 28 (విజయక్రాంతి) ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం వద్ద బుధవారం అక్రమంగా తరలిస్తున్న రూ,4.15 కోట్ల విలువ గల 830. 540 కిలోల నిషేధిత గంజాయిని జూలూరుపాడు, సిసిఎఫ్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు.
సంఘటన వివరాలను ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం విశ్వాసనీయ సమాచారం మేరకు జూలూరుపాడు, సిసిఎఫ్ పోలీసులు సంయుక్తంగా పడమట నర్సాపురం గ్రామం వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఐచర్ వాహనం తనకి చేయగా 830. 540 కిలోల విలువగల గంజాయి తరలిస్తూ గుర్తించడం జరిగిందన్నారు.
పట్టుకున్న గంజాయి విలువ రూ 4, 15, 27,000 ఉంటుందన్నారు. అట్టి గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. గంజాయిని పట్టుకున్న జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సు రవి, సిసిఎఫ్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్ఐ ప్రవీణ్లను ఎస్పీ అభినందించారు.