22-11-2025 10:01:35 PM
ముఖ్యఅతిథిగా శ్రీనిధి యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ నరసింహారెడ్డి
మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లిలో శనివారం నాడు సెజ్ పాఠశాల ప్రాంగణంలోఈ కార్నివాల్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.నామట్టి - నాదేశం అనే నినాదముతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనిధి విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ నరసింహ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ ఎస్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ అభినందించారు. సేజ్ పాఠశాల విద్యార్థులందరూ సమిష్టిగా శ్రమించి సమగ్ర భారతావనిని ఈ కార్నివాల్ లో ఆవిష్కృతం చేశారు.
భాషలు, సంస్కృతులు, వైద్య, రవాణ, కృత్రిమ మేధస్సు లాంటి అనేకమైన ప్రాచీనం నుండి నేటి ఆధునికత వరకే కాకుండా భవిషత్ లో ఎలాంటి సాంకేతికత రాబోతుందో తము నమూనాల ద్వారా విదార్థులు ఈ కార్నివాల్ లోప్రదర్శించారు. ఈ నమూనాలు విద్యార్థుల తల్లి దండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమము లో ప్రిన్సిపల్ చైత్రరెడ్డి, అకాడమీ డైరెక్టర్ సీతామహాలక్ష్మి, డైరెక్టర్ రోహిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమమును విజయవంతం చేసినందుకు విద్యార్థినీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ నామట్టి - నాదేశం అనే నినాదాన్ని ప్రతిజ్ఞ చేశారు.