2 July, 2026 | 12:20 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఉపసంహరించండి: డిప్యూటీ సీఎం భట్టి

07-04-2025 06:27 PM

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు(IT Minister Sridhar Babu), పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy)లతో చర్చించిన అనంతరం భట్టి విక్రమార్క ఈ నిర్ణయం తీసుకున్నారు. జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలని డిప్యూటి సీఎం ఆదేశించారు. కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని భట్టి కోరారు. అలాగే ఉపసంహరణలో న్యాయపరమైనా సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. సమస్యలు రాకుండా న్యాయశాఖ అధికారులు తగు సూచనలు చేయాలని తెలిపారు.