calender_icon.png 8 June, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసులు అరెస్టులకు వెనకాడేది లేదు

07-06-2025 01:59:23 AM

జేఏసీ నాయకులు

సింగరేణి జేఏసీ నాయకుల మీద పోలీస్ కేసులు

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 6 (విజయక్రాంతి) పోలీసులు పెట్టే కేసులకు అరెస్టులకు వెనకాడేది లేదని అనునిత్యం సింగరేణి సంస్థ మనుగడ కార్మికుల హక్కుల సాధనకై నిరంతరం పోరాటం చేస్తామని సింగరేణి కార్మిక సంఘం జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

శుక్రవారం వారు విడుదల చేసిన ప్రకటనలో సింగరేణి సంస్థలో ప్రైవేటికరణకు వ్యతిరేకంగా , సింగరేణి ప్రాంతంలో ఉన్న కోల్ బ్లాకులను తెలంగాణ రాష్ట్ర మనుగడకై సింగరేణికే కేటాయించాలని జరిగిన సమ్మెలో సింగరేణిలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలైనట్టి ఏఐటీయూసీ, ఐన్టీయూసీ, సీఐటీయూ,టీబిజికేయస్, బిఎంయస్ ,ఇఫ్టు సంఘాలు 2020లో కోవిడ్ సమయంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ముందర ధర్నా చేపట్టిన సందర్భంలో కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ వారు కోవిడ్ రూల్స్ ని వ్యతిరేకించారని 18 మంది జేఏసీ నాయకులు, వారి కార్యకర్తల మీద కేసు నమోదు చేశారు.

1టౌన్ పోలీస్ అధికారులుగత నెలలో ఈ 18 మందికి సమన్లు పంపి గత నెల 29 న కోర్టుకు హాజరు కావాలని కోరారు. లాయర్ ద్వారా వారు మెమోను కోర్టు కు అందించగా కోర్టు పిలుపుపై జేఏసీ నాయకులు కోర్టు వాయిదాకు హాజరయ్యారు. మరల ఈ కేసును గౌరవ కోర్టు తదుపరి వాయిదా జూలై24 కు వేయడం జరిగింది. బొగ్గురంగ పరిశ్రమలో కార్మికుల నిరంతర హక్కులకై , బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరించకుండా పోరాటాలు చేస్తున్న జేఏసీ నాయకుల మీద కేసులు బనాయించి ఇబ్బదులకు గురిచేస్తున్న ప్రభుత్వ,సింగరేణి యజమాని విధానాలను జేఏసీ నాయకులు ఖండించారు. పోలీస్ కేసులు, అరెస్టులు తమ పోరాటాలను ఆపలేవని, తాము నిత్యం కంపెనీ, కార్మికుల శ్రేయస్సుకి పాటుపడతామని నాయకులు వంగ వెంకట్, త్యాగరాజన్, మంద నరసింహారావు, మాధవ్ నాయక్, ఏవి రామారావు, సోమిరెడ్డి, సంజీవ్ తదితరులు ప్రకటన విడుదల చేసిన వారిలో ఉన్నారు.