calender_icon.png 8 June, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచార వాల్‌పోస్టరు ఆవిష్కరించిన ఆర్డీవో

07-06-2025 01:59:59 AM

తూప్రాన్, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వం క్రొత్తగా ప్రారంభించిన రామాయంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రచార గోడ పోస్టర్ ను ఆర్డిఓ జయచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఆయన  మాట్లాడుతూ కాలేజీ ప్రత్యేకతలపై వివరించారు. అనుభవం, అంకితభావం, కల్గిన బోధనా సిబ్బందితో విద్యార్థులకు కంప్యూటర్ అవగాహన కార్యక్రమాలు, సర్వతో ముఖాభివృద్ధికై వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ఉన్నాయన్నారు. 

పోటీ పరీక్షలకు గైడెన్స్, ఉచిత శిక్షణ, అన్ని రకాల కోర్సులతో పాటు ఎంఓఓసి మాసివ్, ఓపెన్ ఆన్లైన్ కోర్సు, స్వయం కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు, ఇందులో రామాయంపేట పరిసర ప్రాంతంలోని చేగుంట నార్సింగి, తూప్రాన్ పట్టణ ప్రాంతంలో గల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. హుస్సేన్, అధ్యాపకులైన భరత్ కుమార్, జువాలజీ వెంకటేశం, ఫిజిక్స్ రాజు, కామర్స్ సుజాత, హిస్టరీ భవాని, నవీన్, తదితర అధ్యాపకులుపాల్గొన్నారు.