2 July, 2026 | 11:48 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

కామారెడ్డి జిల్లాలో 16 మంది వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు

26-03-2025 11:03 PM

ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకొని అధిక వడ్డీలకు ఇచ్చిన వ్యాపారులు..

వడ్డీ వ్యాపారులకు షాక్ ఇచ్చిన పోలీసులు..

కామారెడ్డి (విజయక్రాంతి): వడ్డీలతో నడ్డి వీరుస్తున్న వడ్డీ వ్యాపారులకు కామారెడ్డి జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. వడ్డీకి డబ్బులు ఇస్తూ ఆస్తులు తనకా పెట్టుకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులను గుర్తించిన పోలీసులు 16 మంది వడ్డీ వ్యాపారులపై కామారెడ్డి జిల్లా పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వడ్డీ వ్యాపారులు ఊహించని విధంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వారు నిర్వహించిన వడ్డీ వ్యాపారం సంబంధించిన పత్రాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులకు పోలీసులు జలక్ సృష్టించారు. ఈ వడ్డీ వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో వడ్డీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరికొంతమంది జిల్లాలో వడ్డీ వ్యాపారులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి భరతం పట్టే చర్యలు త్వరలోనే తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.