14-06-2025 11:41:47 PM
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత..
గద్వాల టౌన్: జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం కోర్టు ఆవరణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 8195 కేసులు పరిష్కరించినట్లు లోక్ అదాలత్ న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ జిల్లా న్యాయమూర్తి ఎన్. ప్రేమలత(District Chief Judge N. Premalatha) తెలిపారు. ఇందులో సివిల్ కేసులు 17 క్రిమినల్ కేసులు బ్యాంక్ ఫ్రీలిటిగేషన్ కేసులు 4 మోటారు వాహన ప్రమాద కేసులు 2 సైబర్ కేసులు 10 పరిష్కరించారు.కేసుల నుండి కక్షిదారులు మొత్తం రూ.63,69,410 వసూలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ... జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల వారు రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకోవచ్చు అన్నారు. ప్రశాంతంగా బతకడానికి ఇది మంచి అవకాశం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జిల్లా జడ్జి ఎస్. రవికుమార్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ వి.శ్రీనివాస్ అదనపు సీనియర్ సివిల్ జడ్జి టి.లక్ష్మి ప్రిన్సిపల్ జానియర్ సివిల్ జడ్జి ఎన్.వి.హెచ్.పూజిత,ఏ.పి.పి సంజన సైబర్ క్రైమ్ సీ.ఐ.రాజు,న్యాయవాదులు,ఎస్సైలు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.