calender_icon.png 15 June, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం

14-06-2025 11:40:07 PM

- ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దాం

- జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ 

గజ్వేల్: ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవం తీసుకురావాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkataswamy) పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఇన్చార్జి మంత్రిగా వివేక్ తొలిసారి గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా రిమ్మనగూడ శివారులో డిసిసి అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్, డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంక్షారెడ్డిలను పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించారు.

అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న చారిత్రాత్మక పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ శ్రేణులు, నాయకులు సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీల చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దామని, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో బలంగా ఉన్న ఆ పార్టీలను ఎదుర్కొనేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, భూభారతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేద వర్గాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ 500 లకే వంట గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డుల మంజూరి, ఖాళీ పోస్టుల భర్తీ తదితర అమలుతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.

కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని, వారికి స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. త్వరలో ఉమ్మడి జిల్లాలో పర్యటించి  పార్టీ శ్రేణుల కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి, గజ్వేల్, కొండపాక, వంటిమామిడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ మోహన్, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మాజీ ఎంపీపీలు నిమ్మ రంగారెడ్డి, సయ్యద్ సలీం, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ గుప్త, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, తమ్మలి శ్రీనివాస్, లింగారావు, కనకయ్య గౌడ్, నేతలు సుఖేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రమేష్ గౌడ్, గాడిపల్లి శ్రీనివాస్, గణేష్ యాదవ్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ గుప్త, కరుణాకర్ రెడ్డి, నర్సింహరెడ్డి, జంగం రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.