14-06-2025 11:45:07 PM
చివ్వేంల: మండల కేంద్రంలో నిన్న రోడ్ ప్రమాదానికి గురు అయి మృతి చెందిన చేరుపల్లి సత్యం(70) భౌతిక దేహానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్, తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు(Ananthula Madhu) పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థి పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు తన కలం రాతల ద్వారా ఊపిరిలుదరని, అనేక ప్రజా సమస్యలు వార్త పత్రిక ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకువచ్చి, సమస్యల పరిష్కారంకై కృషి చేసేవారని, తొలి, మలి దశ తెలంగాణ పోరాటంలో తనదైన పాత్ర పోషించరని, పత్రిక రంగంలో సుధీర్ఘ సేవలు అందించి, ప్రజల సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేసారని, ఈ సందర్బంగా ఆయన అందించిన సేవలు కొనియాడారు. వారి మృతి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ జనార్దన్ చారి, పల్లా పరమేష్, తెలంగాణ యువజన సంఘము చివ్వేంల మండల అధ్యక్షులు చెరుకు నగేష్, వివిధ దిన పత్రికల విలేకరులు విక్రమ్ కుమార్, సతీష్, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.