17-06-2025 12:00:00 AM
గద్వాల్ టౌన్ జూన్ 15 : ప్రైవేట్ రంగం రిజర్వేషన్లు జనగణనలో కులగణన చేయాలనిభాహుజన రాజ్యసమితి బీసీ ఉపాధ్యా య సంఘం నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని ఓ ప్రవేట్ కార్యాలయం లో సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ని ర్వహించారు.
ఈ సందర్బంగా ఆయా సం ఘాల నాయకులు మాట్లాడుతూ... దేశంలో జనాభా లెక్కలు ద్వారా కులగణన ద్వారా వారి శాతాన్ని తెలిపి, ప్రభుత్వ రంగంతో పాటు ,ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్లు కల్ప న చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు వేల వందల కోట్లతో నడుస్తున్న ప్రైవే ట్ లిమిటెడ్ కంపేనీలు బిఎస్ఈ, ఎన్ఎస్ఈ లో షేర్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపేనీ లు తప్పనిసరిగా రిజర్వేషన్ లద్వారా ఉద్యోగాలను బర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాహుజన రా జ్య సమితి జిల్లా అధ్యక్షులు బిఆర్ఎస్,బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు,సిపిఎం జిల్లా కార్యద ర్శిలు,తెలంగాణ రైతాంగ సమితి వివిధ సంఘాల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.