calender_icon.png 16 June, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

16-06-2025 12:00:00 AM

  1. భూముల వివరాలన్నీ మ్యాపుల్లో నిక్షిప్తం 
  2. పైలెట్ ప్రాజెక్టుగా కోమనపల్లి ఎంపిక 
  3. త్వరలో మరిన్ని గ్రామాల్లో కూడా 

జగిత్యాల అర్బన్, జూన్ 15 (విజయక్రాంతి): ఇటీవల భూముల ధరలు అధికం గా పెరిగి క్రమంగా లక్షల నుండి కోట్ల రూ పాయల వరకు పలుకుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు, సమస్యలు అధికమవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు నమోదు కావడం, సర్వే నంబర్ల వారీగా మ్యాపులు లేకపోవడం, కొన్ని గ్రామాల్లో కనీస నక్షాలు లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

వీటిని ఆసరాగా చేసుకుని కొందరు డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో భూ వివాదాలు కాస్త ముదిరి శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తున్నా యి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త గా తెచ్చిన భూభారతి చట్టంలో మార్పు లు తీసుకువచ్చింది. దీని ప్రకారం ఇకనుండి భూముల రిజిస్ట్రేషన్లకు తప్పకుండా మ్యాప్ ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది.

నక్షాలు లేని గ్రామాల్లో సర్వే చేపట్టి మ్యాప్లను రూ పొందించాలనే ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో ఐదు గ్రామాలను ఎంపిక చేసింది. ఇందు లో భాగంగా జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం కోమనప ల్లిని ఎంపిక చేశారు. ఈ గ్రామంలో భూము ల నక్ష లేకపోవడంతో పహాణీల్లో ఉన్న నంబర్ల ఆధారంగా సర్వే చేపట్టి మ్యాప్ లను రూపొందిస్తారు.

సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో  మార్వెల్ జియో ఫేషియల్ సొల్యుషన్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే ప్రైవేట్ ఏజెన్సీ తో కలిసి సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఆ గ్రామంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికారడ్స్ ఆదేశాలమేరకు  సర్వే మొదలుపెట్టారు. గ్రామంలో పూర్తి సర్వే చేసిన అనంతరం పహాణీల్లో ఉన్న సర్వే నంబర్ల ప్రకారం మ్యాపులను జారీ చేస్తారు.

వారం రోజుల్లో పూర్తి...

బీర్ పూర్ మండలం కోమనపల్లిలో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న భూ సర్వే వారం రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే రెండుసార్లు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ బీ.ఎస్.లత ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించి సర్వే గురించి వివరించారు. వారం రోజుల్లోపు సర్వే పూర్తి చేసి వారి సర్వే ప్రకారం నక్ష పటాలు అందించనున్నారు.

ఇది విజయవంతం అయితే జిల్లాలోని మరిన్ని గ్రామాల్లోనూ సర్వే చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. సర్వేలో భాగంగా గ్రామంలోని భూములకు హద్దులు గుర్తిస్తారు. ఇందులో ఏ సర్వేనంబర్లు ఎందులో ఉన్నాయి?, చెరువులు, నాళాలు, కుంటలు, వాగులు, అసైన్డ్ భూములు, గ్రామకంఠం భూములెన్ని ఉన్నాయి? అన్నది చూసి అనంతరం సర్వే చేపడతారు. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లకు అధికారులు బై నంబర్లు ఇచ్చుకుంటూ వ చ్చారు.

ఇందులో కొన్ని గొడవలు ఉన్నాయి. అంతే కాకుండా ఒక రైతుకు చెందిన భూమిలో ఎక్కువ సర్వేనంబర్లుండటంతో రికార్డుల్లో ఉన్న భూమికి. క్షేత్ర స్థాయిలో ఉన్న భూమికి అనేక తేడాలు ఉండటంతో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. మోఖా మీద ఒక విధంగా, కాగితాల్లో మరో విధంగా ఉండటంతో సమస్యలు తలెత్తేవి. ఇప్పుడు అలాంటివి లేకుండా మ్యాప్లను పక్కాగా తయారుచేసి ఇస్తారు.

ఎవరైనా క్ర య విక్రయాలు జరిపినా మ్యాపుల ఆధారంగానే జరపాల్సి ఉంటుంది. డ్రోన్లు, అత్యా ధునిక కెమెరాల సహాయంతో సర్వే చేపడతారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద కోమనపల్లిలో చేపడుతున్న సమగ్ర సర్వేతో మ్యాపుల రూపకల్పన పూర్తి చేసి మరికొన్ని గ్రామాల్లో సర్వే చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిసింది. జిల్లాలో ఎలాంటి మ్యాప్స్, నక్షాలు లేకుండా 16 గ్రామాలుండగా ప్రస్తు తం పైలెట్ ప్రాజెక్ట్ కింద కోమనపల్లిలో సర్వేచేపడుతున్నారు.