24-06-2025 12:32:28 AM
ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్
అదిలాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐ విచారణ చేపడితే బీఆర్ఎస్ నేతల అవినీతి బాగోతం అంతా బయటపడుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ కేంద్ర, రాష్ట్ర శాఖ ఒకటే స్టాండ్పై ఉన్నాయని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు, ఇతర బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముమ్మాటికి అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రులు ప్రకటిస్తున్నప్పటికి లోతైన విచారణ జరగడంలేదని అన్నారు. లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు జ్యోతి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రఘుపతి, మయూర్ చంద్ర, కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు