calender_icon.png 2 June, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిమల్కాపూర్ మార్కెట్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు

30-05-2025 12:00:00 AM

ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ 

హైదరాబాద్, మే 29:  గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్‌లో కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో  గురువారం రూ. 17.5లక్షలతో 92 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏసీపీ మున్వర్, ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కావలి చంద్రశేఖర్, ట్రాఫిక్ సీఐ అంజయ్య, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి ఎల్ శ్రీనివాస్, సిబ్బంది హాజరయ్యారు.

చైర్మన్ తలారి మల్లేష్ మాట్లాడుతూ.. రైతులకు, వినియోగదారులకు ఎల్లప్పుడూ మంచి జరిగేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల వల్ల మార్కెట్ యార్డులో అక్రమాలు, చోరీలను అరికట్టవచ్చన్నారు. రైతుల శ్రేయస్సు కోసం తమ కమిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు.